PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…

1 min read

ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

 పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా కేంద్రమైన   రాయచోటి పట్టణంలోని  ఠాణా- సుండుపల్లె బైపాస్ నాలుగు వరుస రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులుకు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. పట్టణంలో జరిగుచున్న – సుండుపల్లె బైపాస్ నాలుగు వరుసల రహదారి పనులను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష ,ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. విస్తరణ పనులలో భాగంగా డ్రైనేజీ కాలువలను అనుసంధానం చేయాలని సూచించారు.ప్రజలకు అంతరాయం లేకుండా పనులను నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.   ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి కడప ,అన్నమయ్య జిల్లాల ఎస్ ఈ  లు మహేశ్వర రెడ్డి, సహదేవ రెడ్డి ,డిఈ వెంకట సుబ్బయ్య, ఏఈఈ గిరీశ్వర రావు, మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, వైఎస్ఆర్ సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, షబ్బీర్,  కౌన్సిలర్లు ఆసీఫ్ అలీఖాన్,కొలిమి ఛాన్ బాష,గౌస్ ఖాన్, ఫయాజ్ అహమ్మద్, రౌనక్,రియాజ్, నాయకులు రియాజర్ రెహమాన్,సున్నా  తదితరులు పాల్గొన్నారు.

About Author