NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటెలిజెన్స్ కార్యాల‌యం పై రాకెట్ దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పంజాబ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ప్రధాన కార్యాలయంపై రాకెట్‌ దాడి జరి గింది. మొహాలీలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. కార్యాలయం మూడో అంతస్తులోకి దుండగులు రాకెట్‌–ప్రొపెల్డ్‌ గ్రెనేడ్ విసిరినట్లు వెల్లడించారు. పేలుడు ధాటికి కిటికీలు, ఫర్నీచరు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. అయితే, ఇది ఉగ్రవాద దాడి కాదని అన్నారు. దీంతో సీనియర్‌ పోలీసు సుపరిడెంట్‌ ఆఫీసర్‌తో కూడిన బృందం కార్యాలయం పరిసర ప్రాంతాలను చుట్టుముట్టారు.

                                              

About Author