PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త తీసుకున్న రోజా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రెండో విడ‌త మంత్రివ‌ర్గంలో రోజాకు చోటు ద‌క్కింది. ఆర్ కే. రోజా రాజ‌కీయ నేప‌థ్యం చూస్తే.. 2004లో నగరి నియోజకవర్గం, 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచారు. 2019 నుంచి 2021 వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్య‌త‌లు నిర్వర్తించారు.

                                     

About Author