PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌మ్య హ‌త్య కేసు.. దోషికి ఉరిశిక్ష !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో.. దోషి శశికృష్ణకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. న్యాయమూర్తి రాంగోపాల్ తుది తీర్పు వెలువరించారు. సోషల్ మీడియా ద్వారా రమ్యకు పరిచయమైన శశికృష్ణ తర్వాత క్రమంలో తన నెంబర్ బ్లాక్ చేసిందనే కారణంతో కక్షపెంచుకున్నాడు. చివరకు గత ఏడాది ఆగష్టు 15న గుంటూరు జిల్లా పరమయ్యకుంటలో రమ్యను హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఘటనా స్థలంలోనే శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల పాటు కేసు విచారణ సాగింది. మొత్తం 28 మంది సాక్షులను న్యాయస్దానం విచారించింది.

                                    

About Author