PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఎమోష‌న‌ల్ అయిన ఆర్ఆర్ఆర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి. ఆ మహానేతకు అందరూ నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా అంజలి ఘటిస్తున్నారు. సంక్షేమ పథకాల సారధి, మనసున్న మారాజు అంటూ గుర్తు చేసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ‘మనసున్న మహారాజు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వై.యస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహ నాయకుడికి నా ఘన నివాళులు’అర్పించారు.

                         


                                             

About Author