PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ నిర్ణయం పై ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత అసంతృప్తి !

1 min read

పల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపుపై ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ.దాన‌య్య అసంతృప్తిని వ్యక్తం చేశారు. ధ‌ర‌ల త‌గ్గింపు ఆర్ఆర్ఆర్ చిత్రం పై తీవ్ర ప్రభావం చూపుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ అంశంపై త్వర‌లో కోర్టును ఆశ్రయిస్తార‌న్న వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో దాన‌య్య క్లారిటీ ఇచ్చారు. ధ‌ర‌ల పెంపు విష‌యంపై తాము కోర్టుకు వెళ్లద‌లుచుకోలేద‌ని స్పష్టం చేశారు. సీఎం జ‌గ‌న్ కలిసి స‌రియైన ప‌రిష్కారం కోరుతామ‌ని చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

About Author