NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలోని పింఛన్​దార్లకు రూ.103.30 కోట్ల రూ. పంపిణీ

1 min read

లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి  పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద  ఏప్రిల్ మాసంలో జిల్లాలో అర్హులైన 2 లక్షల 38 వేల 302 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.103.30 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.  మంగళవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నగరంలోని  సాయిబాబా సంజీవ నగర్ లో అరుణ జ్యోతి, శంకరమ్మ లకు వితంతు పెన్షన్లు,  దేవర్ల నరసింహులు,   భీమక్క, లలితా బాయి, రాగప్ప లకు వృద్ధాప్య పెన్షన్ లను వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్  అందజేశారు.ఈ సందర్భంగా    పెన్షన్ అందచేసే సమయంలో సర్వర్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయా?? టెక్నికల్ సమస్యలు ఏమైనా  ఉన్నాయా?? అని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడిగి  తెలుసుకున్నారు.లబ్ధిదారులతో మాట్లాడుతూ పెన్షన్ లు సరైన సమయానికి ఇస్తున్నారా?? ఉదయం ఏ సమయానికి ఇస్తున్నారు ?? ఒకవేళ ఈ నెల మీరు పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల రెండు పెన్షన్ లు కలిపి తీసుకోవచ్చు  అని కలెక్టర్ పెన్షన్ దారులకు అని అవగాహన కల్పించారు.దేవర్ల నరసింహులకు వృద్ధాప్య పెన్షన్ ను అందచేస్తూ కలెక్టర్ వారి కుటుంబం, పిల్లల గురించి అడిగి తెలుసుకున్నారు.. అతని ఇల్లు సరిగా లేకపోవడంతో   ఇంటిని నిర్మించుకునేందుకు అతని నుండి  దరఖాస్తు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత సచివాలయం సిబ్బందిని ఆదేశించారు… ఎవరికైనా ఇల్లు లేకపోయినా,  గుడిసెలో ఉన్నా, ఇల్లు సరిగా లేకపోయినా, అలాంటి వారికి ఇల్లు మంజూరు చేసేందుకు దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్ సచివాలయం సిబ్బందిని ఆదేశించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు , కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, డిఆర్డిఎ పిడి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *