PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌డుపులో రూ. 11.53 కోట్ల హెరాయిన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.11.53 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. గత నెల 26న దక్షిణాఫ్రికా నుంచి ఓ ప్రయాణికుడు తన కడుపులో 1.38 కిలోల హెరాయిన్‌ దాచుకొని శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాడు. అధికారులు అతడి బాడీ స్కాన్‌ చేయగా కడుపులో 108 క్యాప్సుళ్లు ఉన్నట్లు గుర్తించారు. అతడిని ఓ ఆస్పత్రికి తరలించి సర్జరీ చేయించి, హెరాయిన్‌ను బయటకు తీయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.

                                

About Author