PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ. 12 వేల కోట్లు జ‌గ‌న్ దారి మ‌ళ్లించారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇళ్ల నిర్మాణంపై జగన్ రెడ్డి మాటలే తప్ప చేతలు శూన్యమని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు మండిపడ్డారు. 3 ఏళ్లలో జరిగిన ఇళ్ల నిర్మాణం కేవలం 4 శాతం మాత్రమేనన్నారు. నివాస యోగ్యం కాని చెరువులు, గుట్టలు, శ్మశానాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల చదును పేరుతో రూ. 7వేలు వైసీపీ నాయకులకు దోచిపెట్టారని ఆరోపించారు. ప్రభుత్వానికి భారతి సిమెంటు ధర పెంచి అమ్ముకోవటంపై ఉన్న శ్రద్ద పేదల ఇళ్ల నిర్మాణంపై లేకపోవటం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం జేబు దొంగలు నయం అనుకొనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారని విమర్శించారు. పంచాయితీ, మున్సిపాలిటీల నిధులు రూ. 12 వేల కోట్లు జగన్ రెడ్డి దారి మళ్లించారని ఆరోపించారు.

                                                  

About Author