PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళల ఖాతాల్లోకి రూ.15 వేలు జమ !

1 min read

పల్లెవెలుగువెబ్ : వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మంగళవారం వర్చువల్ గా ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. అగ్రవర్ణ మహిళలను మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 3.92 లక్షల మందికి లబ్ధిదారులకు రూ.589 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వార ఏడాదికి రూ. 15 వేల చొప్పున మూడేళ్లలో రూ. 45 వేలు సాయం చేయనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు పేద అగ్రవర్ణ మహిళలు ఈ పథకానికి అర్హులు.

          

About Author