PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ. 18000 కోట్లు వెనక్కి ర‌ప్పించారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ్యాంకులకు పెద్దమొత్తంలో రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ.18,000 కోట్లు తిరిగి బ్యాంకులకు రప్పించామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు బుధవారంనాడు తెలిపారు. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ సారథ్యంలోని ధర్మాసనానికి ఆ వివరాలు సమర్పించారు. ధర్మాసనంలో ఇతర సభ్యులుగా జస్టిస్ దినేష్ మహేశ్వరి, సీటీ రవికుమార్ ఉన్నారు. మనీ లాండరింగ్ చట్టం కింద రూ.67,000 కోట్లు విలువ చేసే క్రిమినల్ ప్రొసీడింగ్స్ అత్యున్నత న్యాయస్థానం ముందు ఉన్నాయని తుషార్ మెహతా చెప్పారు.

                                        

About Author