PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బద్వేల్​ అభివృద్ధికి రూ.792కోట్లు! మంత్రి పెద్దిరెడ్డి

1 min read

పల్లెవెలుగువెబ్​, కడప: బద్వేల్​ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం రూ.792కోట్లు కేటాయించిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈనెల 30న బద్వేల్​ ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వైసీపీ విస్తృత స్థాయి ప్రచారం, సమావేశాలతో ఓట్టలను చైతన్యపరుస్తోంది. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ పునాదులు లేని కాంరగెస్​, అడ్రస్ లేని బీజేపీలు ఎన్నికల బరిలో ఏమని ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్​.జగన్​ బద్వేల్​ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, రూ.792కోట్లు కేటాయించారన్నారు. తాగునీటి శాశ్విత పరిష్కారానికి బ్రహ్మంసాగర్​ ద్వారా పనులు చేపట్టామని, నియోజకవర్గం పరిధిలో 5వేల ఇళ్లు ఇచ్చామన్నారు. సీఎం జగన్​ ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి రెండు కళ్లుగా చేసుకుని రాష్ట్ర పాలన సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న నవరత్న పథకాలే వైసీపీని గెలిపిస్తాయని, బద్వేల్​ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

About Author