NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లికి వందనం ద్వారా విదార్థులకు రూ.8,745 కోట్ల సాయం

1 min read

అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

గత ప్రభుత్వం కంటే ఏడాదికి రూ.3,205 కోట్లు అదనంగా కూటమి ప్రభుత్వ సాయం

ఐదేళ్లలో రూ.16వేల కోట్లు అదనంగా తల్లుల అకౌంట్లలో కూటమి ప్రభుత్వం జమ

9,600 పాఠశాలల్లో వన్ క్లాస్, వన్ టీచర్

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులను కోరుతున్నా

వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వానిది

రూ.2వేలు నా బ్యాంక్ అకౌంట్ లో పడినట్లు 24 గంటల్లో నిరూపించాలి, లేనిపక్షంలో తీవ్రమైన పరిణామాలు

తల్లికి వందనం పథకంపై విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్

ఉండవల్లి, న్యూస్​ నేడు: అర్హులు ఎంతమంది ఉన్నా తల్లికి వందనం సాయం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తల్లికి వందనం పథకంపై ఉండవల్లి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. బాబు సూపర్ సిక్స్ లో ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా 8,745 కోట్ల రూపాయలను 67,27,000 విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమచేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి తరగతి, ఇంటర్ మొదటి ఏడాది పిల్లలు చేరిన తర్వాత వారి తల్లుల అకౌంట్లలో కూడా నిధులు జమచేయడం జరుగుతుంది. తల్లి లేని పిల్లలు ఉంటే వారి తండ్రి అకౌంట్ లేదా గార్డియన్ అకౌంట్ లో ఈ నిధులు జమచేయడం జరిగింది. అనాథాశ్రమాల విషయంలో రీవాలిడేట్ చేసుకుని జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు చేసి వారి అకౌంట్లలో నేరుగా నిధులు జమచేయడం జరుగుతుంది. అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందిగౌరవ ముఖ్యమంత్రి  ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు, ఎలా చేస్తామనేది చెప్పడం జరిగింది. ప్రజలందరినీ నేను కోరేది ఒక్కటే.. అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాదాపు ఇప్పటికే ఒక్కరే సంతానం ఉన్న 18.55 లక్షల మంది తల్లుల అకౌంట్ లో రూ.13వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఇద్దరు పిల్లలు ఉన్న 14.55 లక్షల మంది తల్లులకు రూ.26వేలు కూటమి ప్రభుత్వం అందించడం జరిగింది. ఇందులో సుమారుగా 29.10 లక్షల మంది పిల్లలు కవర్ అవుతారు. ముగ్గురు పిల్లలు ఉన్న 2.10 లక్షల మంది తల్లుల అకౌంట్ లో రూ.39వేలు కూటమి ప్రభుత్వం అందజేయడం జరిగింది. ఇందులో 6.32 లక్షల మంది పిల్లలు కవర్ అయ్యారు. ప్రజలందరికీ ఒకటే చెబుతున్నా.. గతంలో ప్రభుత్వ పాఠశాలల గురించి నాకు తెలుసు. కరెక్ట్ గా డేటా లేదు. ఎంతమంది పిల్లలు చదువుతున్నారో తెలియని పరిస్థితి. రాజకీయ నాయకుల ఫోటోలు లేవు. బ్యాగ్ బరువు తగ్గించేందుకు కృషిచేశాం. సీరియస్ గా ఆలోచించి సంస్కరణలు తీసుకువచ్చాం. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా.. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి.రూ.2వేలు నా బ్యాంక్ అకౌంట్ లో పడినట్లు నిరూపించని పక్షంలో తీవ్రమైన పరిణామాలుప్రతిపక్ష పార్టీ నాపైన తీవ్ర ఆరోపణలు చేసింది. వాళ్లు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్లకు నేను 24 గంటల సమయమిస్తున్నా. రూ.2వేలు నా బ్యాంక్ అకౌంట్ కు వచినట్లు నిరూపించండి. లేదా ఆ స్టేట్ మెంట్ ఉపసంహరించుకోండి. లేనిపక్షంలో చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్ గా దీనిపైన ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైసీపీ అనేది ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజం చేసేందుకు ప్రయత్నిస్తుంది. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని వారే చంపి, నింద మాత్రం మా నాయకుడు చంద్రబాబు గారిపై వేశారు. మేం ఆనాడు సమర్థంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి.. చెల్లెళ్లే చెబుతున్నారు ఏం జరిగిందో. చాలా అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధ్యతప్రమాణాలు పెంచితే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వస్తారని నేను బలంగా నమ్ముతున్నా. మా ఉపాధ్యాయులపై నాకు విశ్వాసం ఉంది. తల్లికి వందనం అమలుపై ఫీడ్ బ్యాక్ చాలా అద్భుతంగా ఉందని, ఉదయం నుంచి నాకు వేల స్క్రీన్ షాట్లు, వీడియోలు కూడా పెడుతున్నారు. వారంతా చాలా సంతోషంగా ఉన్నారన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *