NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూ. 60 వేల కోట్లతో ఏపీ అభివృద్ధి చేస్తా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్‌ను రూ. 60వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘కేఏ పాల్ రావాలి.. పాల్‌తోనే పాలన మారాలి.. ఇదే మా నినాదం’ అని అన్నారు. ఇక తన పార్టీ ఎవ్వరికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావడం అవసరమన్నారు. డబ్బులు ఎలా తేవాలి, ఎలా ఖర్చు ‌చేయాలో తెలుసునని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వంద వాగ్దానాలు ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు.

                                

About Author