PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తీన్మార్ మ‌ల్లన్న రూ. 30 ల‌క్షల డిమాండ్: ల‌క్ష్మీకాంత‌శ‌ర్మ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తీన్మార్ మ‌ల్లన్న త‌న‌కు ఫోన్ చేసి రూ.30 ల‌క్షలు డిమాండ్ చేశార‌ని జ్యోతిష్యుడు ల‌క్ష్మీకాంత శ‌ర్మ ఆరోపించారు. 30 ల‌క్షల రూపాయ‌లు ఇవ్వనందునే త‌న మీద అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని ల‌క్ష్మీకాంతశ‌ర్మ అన్నారు. ఈ మేరకు ల‌క్ష్మీకాంత శ‌ర్మ పోలీసు కేసు పెట్టారు. రాత‌పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడంతో చిల‌క‌ల‌గూడ పోలీస్ స్టేష‌న్ లో కేసు నమోద‌యింది. సీతాఫ‌ల్ మండిలోని మ‌ధురా న‌గ‌ర‌లో మారుతి సేవ సంస్థ పేరుతో ల‌క్ష్మీకాంత శ‌ర్మ జ్యోతిష్యాల‌యం న‌డుపుతున్నారు. అలాగే ప‌లు ప్రముఖ టీవీ చానెల్స్ లో జ్యోతిష్యం గురించి చెబుతుంటారు. తీన్మార్ మ‌ల్లన్న క్యూ న్యూస్ పేరుతో యూట్యూబ్ న్యూస్ ఛానెల్ న‌డుపుత‌న్నారు. ఇటీవ‌లే ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, నల్గొండ ప‌ట్టభ‌ద్రుల స్థానానికి ఎమ్మెల్సీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.

About Author