NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూ. 3 ల‌క్ష‌ల‌కు.. 12 ల‌క్ష‌ల న‌కిలీ నోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న‌కిలీ నోట్ల చెలామ‌ణి పేట్రేగిపోతోంది. విశాఖ‌ప‌ట్నంలో న‌కిలీ నోట్ల చెలామ‌ణి క‌ల‌క‌లం రేపింది. సీతమ్మధారకు చెందిన ఓ వ్యక్తి ఒడిశా నుంచి నకిలీ నోట్లు తీసుకొస్తున్నట్టు ఎంవీపీ కాలనీ పోలీసులు గుర్తించారు. ఎంవీపీ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు గురువారం రాత్రి రాజాన విష్ణు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్దనున్న నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించగా సీతమ్మధారకు చెందిన యాగంటి ఈశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఈ నకిలీ నోట్లు పొందినట్లు వెల్లడించాడు. ఈశ్వరరావుకు రూ.3 లక్షల నగదు ఇవ్వగా, అతను ఒడిశా తీసుకెళ్లి రూ.12 లక్షల విలువచేసే నకిలీ నోట్లు ఇప్పించినట్లు వెల్లడించారు. ఇందులో రూ.4.77 లక్షల నకిలీ నోట్లు ఇప్పటికే మార్చినట్లు చెప్పాడు.

                               

న‌కిలీ నోట్లు, విశాఖ‌, ఎంవీపీ, ఒడిశా

About Author