PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ. 300 కోట్ల‌తో స‌న్మానం ఎందుకు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో మద్యం షాపుల్లో క్యాష్ విధానం ఎందుకని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ వాలంటీర్లకు రూ.300 కోట్లతో సన్మానం ఎందుకని నిలదీశారు. తల్లీ బిడ్డా ఎక్స్‌ప్రెస్‌ పథకం గతంలో కూడా ఉండేదని, ఇప్పుడు దాని పేరు మార్చి వైఎస్సార్ తల్లీ, బిడ్డా ఎక్స్‌ప్రెస్ అని పెట్టారన్నారు. గర్భానికి, గర్వానికి తేడా తెలియకుండా సీఎం జగన్‌ మాట్లాడారని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రామాలయంలో క్రైస్తవ ప్రచారం చేయడం దారుణమన్నారు.

                                    

About Author