PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించాలి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. పీఎఫ్ఐపై నిషేధం విధించిన మాదిరే… విద్వేషాలను రెచ్చగొడుతున్న అన్ని సంస్థలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ముందు ఆరెస్సెస్ ను నిషేధించాలని ఆయన అన్నారు. ఆరెస్సెస్ ను సర్దార్ పటేల్ నిషేధించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఆరెస్సెస్ అనేది ఒక అతివాద హిందూ సంస్థ అని, దీన్ని బ్యాన్ చేయాల్సిందేనని అన్నారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. మరోవైపు. పీఎఫ్ఐపై నిషేధం విధించడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

                                             

About Author