PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గూడురులో ఆర్టీసీ బస్సు.. టిప్పర్​ ఢీ..!

1 min read

పల్లెవెలుగు వెబ్​, గూడూరు: ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొన్న ఘటన గూడురులో చోటు చేసుకుంది. మంగళవారం గూడూరు పట్టణంలో ఈర్లదిన్నె నుండి ఇసుక టిప్పర్ కర్నూలుకు వెళుతుండగా కర్నూలు నుండి ఎమ్మిగనూరు కి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా వెళ్లలేక ఇరుకు రోడ్లలో ఢీ కొంది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆర్టీసీ బస్సు ఇసుక టిప్పర్ ఢీకొన్న నేపథ్యంలో గూడూరు పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న గూడూరు ఎస్సై వెంకట నారాయణ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. గూడురు నగర పంచాయతీ అధికారులు స్పందించి రోడ్ల విస్తరణ చేపట్టాలని ప్రజలు కోరారు.

About Author