NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కళ్యాణ మండపాల్లో నిబంధనలు పాటించాలి

1 min read

వేంపల్లి తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు
పల్లెవెలుగు వెబ్​, వేంపల్లె: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్​లు ధరించి, శానిటైజర్​ ఉపయోగించి, భౌతిక దూరం పాటించాలని వేంపల్లె తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం స్థానిక వేంపల్లె పోలీస్ స్టేషన్ లో స్థానిక కల్యాణ మండపాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్​ మాట్లాడుతూ.. కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమాలకు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు.. నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవలని చెప్పారు.. అలాగే డిమాండ్ క్రియేట్ చేసి అధిక అద్దెలు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు.. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో అందరూ సహకరించాలన్నారు.. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సైలు సుభాష్ చంద్రబోస్, మల్లికార్జున్ రెడ్డితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author