PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూపాయికే పెట్రోల్… కిలో మీట‌ర్లు లైన్లో జ‌నం..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: రూపాయికే లీట‌ర్ పెట్రోల్ అందించ‌డంతో జ‌నం బారులు తీరారు. కిలో మీట‌ర్లు జ‌నం క్యూలో నిల‌బడ్డారు. మ‌హారాష్ట్రలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ముంబ‌యిలోని డోంబీవ‌లి యువ‌సేన ఈ కార్యక్రమం చేప‌ట్టింది. మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విష‌యం తెలియ‌గానే బంకు ముందు జ‌నం క్యూలైన్లలో నిలిచారు. మ‌రోవైపు మ‌హారాష్ట్రలోని అంబ‌ర్ నాథ్ వింకా న‌కోలో ఓ పెట్రోల్ బంక్ లీట‌ర్ 50 రూపాయ‌ల‌కే పెట్రోల్ అందించారు. ఇది కేవలం 1 గంట వ‌ర‌కు క్యూలైన్లలో ఉన్నవారికే అని నిర్వాహ‌కులు తెలిపారు.

About Author