PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ ఊర్లో రూపాయికే ప్లేట్​ ఇడ్లీ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : రూపాయికి ఒక చాక్లెట్, ఒక బిస్కెట్ వ‌స్తుంది. కానీ ప్లేట్ ఇడ్లీ, మూడు ర‌కాల చ‌ట్నీ ఎలా వ‌స్తుంది అని ఆశ్చర్యపోతున్నారా ? . అవును నిజంగానే రూపాయికే ఇడ్లీతో పాటు మూడు ర‌కాల చ‌ట్నీ ఇస్తున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా పెద్దాపురం మండ‌లం ఆర్బీ కొత్తూరు గ్రామంలో రాంబాబు అనే వ్యక్తి రూపాయికే ఇడ్లీ అమ్ముతున్నారు. మైసూరు బ‌జ్జీలు కూడ రూపాయికే అమ్ముతారు. చుట్టూ ఉన్న హోట‌ళ్లు స‌ర‌కుల రేట్లు పెర‌గ‌డం కార‌ణంగా రేట్లు పెంచితే.. రాంబాబు మాత్రం రూపాయికే ఇప్పటికీ ఇడ్లీ అమ్ముతున్నారు. హోట‌ల్ అద్దె క‌ట్టే ప‌నిలేకుండా ఇంటి నుంచి హోట‌ల్ నిర్వహిస్తున్నారు. రుచికి, శుచికి ప్రాధాన్యం ఇస్తుండ‌టంతో చుట్టుప‌క్కల గ్రామాల నుంచి జ‌నం వ‌స్తున్నారు. రోజుకు 5000 మంది త‌న హోట‌ల్ కి వ‌స్తార‌ని ఆయ‌న చెబుతున్నారు. త‌క్కువ డ‌బ్బుకు ఎక్కువ అమ్ముతుండ‌టంతో న‌ష్టం రావ‌డంలేద‌ని చెబుతున్నారు.

About Author