NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధి పై బహిరంగ చర్చకు జగన్ సిద్దామా… టిడిపి

1 min read

సైకిల్ తొక్కితే ఆరోగ్యం వస్తుంది, గ్లాసులో టీ తాగితే వ్యక్తిలో జోష్ వస్తుంది..

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విద్వాంస్కర పాలన సాగుతోంది

ఏలూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి)

విలేకరుల సమావేశంలో పలు విమర్శలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రం లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరమైన పాలన సాగుతోందని ఏలూరు నియోజక వర్గ టి డి పి ఇంచార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) విమర్శించారు.సోమవారం ఏలూరు లో బడేటి క్యాంపు కార్యాలయం లోజరిగిన ప్రెస్ మీట్ లో  బడేటి వై సి పి పాలన పై తీవ్ర విమర్శలు చేసారు.అనంతపురం లో జరిగిన సిద్ధం సభలో సి ఎం జగన్మోహన్ రెడ్డి టి డి పి  జనసేన పార్టీ గుర్తులపై చేసిన విమర్శలను బడేటి తిప్పి కొట్టారు.సైకిల్ తొక్కితే ఆరోగ్యం వస్తుందని. గ్లాస్ లో టీ తాగితే జోష్ వస్తుందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో ప్యాన్ రెక్కలు విరిగిపోతే పక్కన పడేస్తారని సి ఎం జగన్మోహన్ రెడ్డిగుర్తు పెట్టుకోవాలి బడేటి చంటి గుర్తు చేశారు.రాష్ట్రం లో చంద్రబాబు నాయుడు పాలనలో చేసిన అభివృద్ధి పై చంద్రబాబు సెల్పీ చాలంజ్ లు చేశారని అభివృద్ధి పై బహిరంగ చర్చకు జగన్ సిద్దామా అంటూ బడేటి సవాల్ విసిరారు.రాప్తాడు లో జరిగిన సిద్ధం సభకు వచ్చిన జనం పారిపోతుంటే ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్ పై వై సి పి మూకలు మూకుమ్మడి దాడి చేయడం దుర్మార్గమన్నారు.యుద్దానికి వై సి పి సిద్ధం అయితే టి డి పి జనసేన లు కూడా సంసిద్ధమే అంటూ సి ఎం జగన్ కు బడేటి బహిరంగ సవాల్ విసిరారు.

About Author