PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొట్టి శ్రీరాములు త్యాగం దేశానికే ఆదర్శం

1 min read

అమరజీవికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య నివాళి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఆయన స్ఫూర్తితో దేశంలో ఎన్నో సరికొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా  శనివారం నందికొట్కూరు పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ    తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం చేపట్టి, నిరాహార దీక్షతో ప్రాణాలను పణంగా పెట్టి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన గొప్ప వ్యక్తి, తెలుగువారు జీవితాంతం రుణపడి ఉండాల్సిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.  ఆ మహనీయుని ఆదర్శాలను గౌరవిస్తూ, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో  టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author