PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంత‌రిక్షం నుంచి భూమి పైకి సుర‌క్షితంగా.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జ‌పాన్ కుబేరుడు యుసాకు మెజవా అంత‌రిక్షం నుంచి భూమి పైకి సుర‌క్షితంగా చేరుకున్నారు. యుసాకు మెజ‌వా 12 రోజుల అంత‌రిక్ష యాత్ర దిగ్విజ‌యంగా పూర్తీ చేశారు. అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో యుసాకు మెజ‌వా , యొజో హిరానో, అలెగ్జాండ‌ర్ మిస్కురిన్ 12 రోజులు పాటు గ‌డిపారు. క‌జ‌కిస్థాన్ లోని బెజ్కాగ‌న్ ప్రాంతంలో సోమవారం ఉద‌యం 9:13 నిమిషాల స‌మ‌యంలో భూమి పై ల్యాండ్ అయ్యారు. ఈ యాత్ర కోసం మెజ‌వా 600 కోట్లు చెల్లించిన‌ట్టు స‌మాచారం. చంద్రుడి పై వెళ్లేందుకు కూడ మెజ‌వా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. 2023లో మొద‌లుపెట్ట‌నున్న ఈ మిష‌న్ కు డియ‌ర్ మూన్ అని పేరు పెట్టారు.

                                              
    

About Author