PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివేక హ‌త్య కేసు ద‌ర్యాప్తు.. వేగ‌వంతం చేసిన సీబీఐ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైఎస్ వివేకా హ‌త్య కేసులో సీబీఐ ద‌ర్యాప్తు వేగ‌వంతం చేసింది. కొంతకాలం గ్యాప్ తర్వాత పులివెందులలో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణకి యూసీఐఎల్‌ ఉద్యోగి ఉదయ్‌కూమార్‌రెడ్డి హాజరయ్యారు. సీబీఐ విచారణకు ఓ దినపత్రిక ప్రతినిధి కూడ హాజ‌ర‌య్యారు. ఇటీవల వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. 2019 మార్చి 15న వివేకా తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

                                                   

About Author