PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాదం పై స్పందించిన సాయి ప‌ల్ల‌వి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విరాట ప‌ర్వం సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ.. కొందరు ఆమెపై కేసులు పెట్టే వరకు వెళ్లారు. దీనిపై సాయిప‌ల్ల‌వి స్పందించారు. విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెబుతాను.. కానీ ఇది సమయం కాదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా.. అదేదో సినిమా ప్రమోషన్ కోసం చేశానని, చెప్పానని అనుకుంటారు. ఈ వివాదం నుంచి నన్ను సేవ్ చేయాలని నా అభిమానులు కూడా చూస్తున్నారని తెలుసు. ప్రస్తుతం నేను ‘విరాట పర్వం’ సినిమా విడుదలవుతున్న ఆనందంలో ఉన్నాను. సినిమా విడుదల తర్వాత.. ఈ వివాదంపై మాట్లాడతాను..’’ అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

                              

About Author