NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్లమ్మ అమ్మవారి ప్రతిష్ట మహోత్సవంలో సాయినాథ్ శర్మ

1 min read

పల్లెవెలుగు వెబ్ కమలాపురం:  పట్టణంలోని సొసైటీ కాలనీలో ఎల్లమ్మ దేవత నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో శనివారం మధ్యాహ్నం సాయినాథ్ శర్మ పాల్గొని పూజలు నిర్వహించారు ఆలయ నిర్వహకులు రాజోలు వీరనారాయణరెడ్డి నిఖిల్ రెడ్డి ఆహ్వానం మేరకు సాయినాథ్ శర్మ ఎల్లమ్మ దేవత ప్రతిష్టా ఉత్సవములో పాల్గొన్నారు ఆలయానికి విచ్చేసిన సాయినాథ శర్మకు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. కమలాపురం పట్టణంలో గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేసి రాజోలి వీరనారాయణ రెడ్డి దంపతులు మంచి పని చేశారన్నారు భారీ స్థాయిలో ఖర్చుపెట్టి మూడు రోజులపాటు ప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించడం చాలా శుభ పరిణామమన్నారు. ఎల్లమ్మ దేవత ఆలయాన్ని దినాభివృద్ధి చెందే కృషి చేయాలన్నారు. సాయినాథ్ శర్మ వెంట భారీ స్థాయిలో ఆయన అనుచరులు ఎల్లమ్మ దేవత పూజా సేవలో పాల్గొన్నారు.

About Author