PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నియోజకవర్గ పాత్రికేయులకు సాయినాథ్ శర్మ ఆపన్నహస్తం

1 min read

– ప్రతి ఒక్కరికి రూ 10 లక్షల విలువచేసే ప్రమాద బీమా
సాయన్నకు జర్నలిస్టుల కృతజ్ఞతలు
పల్లెవెలుగు వెబ్ కమలాపురం:  కమలాపురం పట్టణానికి చెందిన ప్రజా నాయకుడు, రాష్ట్ర టీడీపీ మాజీ కార్యదర్శి,పుణ్య భూమి చారిటబుల్  ట్రస్ట్ చైర్మన్ కాశీభట్ల సత్యసాయినాథ్ శర్మ  నూతనసంవత్సర శుభాకాంక్షలతో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు , ఒక్కొక్కరికి  రూ.10 లక్షల విలువచేసే ప్రమాద బీమా తన సొంత నిధులతో  చేయిస్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లిన  స్థానిక మీడియా సభ్యులతో  ముచ్చటిస్తూ కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ వారికి  ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు. దీంతో కమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయన్నకు పాత్రికేయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమపై ప్రత్యేక దృష్టి సారించి తన సొంత నిధులతో సాయన్న  తమకు రూ.పది లక్షలు విలువచేసే ప్రమాద బీమా చేయిస్తుండటం అభినందనీయమన్నారు. అనంతరం సాయినాథ్ శర్మ మాట్లాడుతూ పాత్రికేయులు నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ సమస్యలను పత్రికల ద్వారా వెలుగులోకి తీసుకు వస్తున్నారని అభినందించారు. తమ కుటుంబాలను కూడా వారు పట్టించుకోకుండా రాత్రింబవళ్లు ప్రజలతో మమేకమవుతుంటారని చెప్పారు. న్యూస్ కవరేజ్ నిమిత్తం వివిధ ప్రాంతాలకు తిరుగుతుంటారని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులకు తన వంతుగా  సహాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గ పరిధిలోని కమలాపురం, సికె దిన్నె, చెన్నూరు, వీఎన్ పల్లె, వల్లూరు,పెండ్లిమర్రి మండలాల పాత్రికేయులకు అండగా ఉంటానని ఆయన తెలిపారు .

About Author