PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంది మండలం పుల్లయ్యను పరామర్శించిన సాయినాథ్ శర్మ

1 min read

పల్లెవెలుగు వెబ్ పెండ్లిమర్రి:  మండలం నంది మండలం గ్రామానికి చెందిన బీసీ నాయకుడు పుల్లయ్య డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ కడప ఆసుపత్రి లో చికిత్స పొంది తమ గృహానికి వచ్చారు పుల్లయ్యకు అనారోగ్య విషయాన్ని తెలుసుకున్న కమలాపురం ప్రజా నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ మంగళవారం నాడు మధ్యాహ్నం నంది మండలంలోని పుల్లయ్య గృహానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.తీవ్ర జ్వరంతో శరీరంలో తెల్ల రక్త కణాలు తగ్గిపోవడంతో పుల్లయ్య తీవ్ర అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా పుల్లయ్య కుటుంబ సభ్యులకు సాయినాథ్ శర్మ ధైర్యం చెప్పారు. నంది మండలం గ్రామానికి చెందిన బి సి నాయకుడు బయన్న ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ ను కలిసి తాము వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులకు గురయ్యామని వారు పెట్టిన ఇబ్బందుల నుంచి తమకు తగిన సహాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బయన్న కు అధైర్య పడవద్దని అండగా ఉంటానని సాయినాథ్ శర్మ భరోసా ఇచ్చారు. పుల్లయ్య త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. నంది మండలం గ్రామానికి చెందిన జయ రాములు, మల్లేష్ నరసింహులు ,రామచంద్ర చిరంజీవి ,గంగాధర్ తదితరులు సాయినాధ శర్మ వస్తున్న విషయాన్ని తెలుసుకుని పుల్లయ్య ఇంటికి వచ్చి సాయినాథ్ శర్మతో కలిసి మాట్లాడారు. కష్టాల్లో తమను ఆదుకునే వారి వెంట తాము ఎప్పటికీ ఉంటామని వారు సాయినాథ్ శర్మతో అన్నారు.సాయినాథ్ శర్మతోపాటు పెండ్లిమర్రి మండలానికి చెందిన నాయకులు సిద్ధారెడ్డి ఎల్వి రానుమునిరెడ్డి, వెంకటేశ్, పెద్ద చెప్పల్లి మాజీ సర్పంచ్ హరిత సుధాకర్ బీసీ నాయకులు లక్ష్మీ నరసింహులుమైనార్టీ నాయకులు మహమ్మద్ రఫీ షుకుర్ తదితరులు పాల్గొన్నారు.

About Author