PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాగంటి ఉమామహేశ్వరుని సన్నిధిలో ఆకలితో అలమటిస్తున్న సాధువులు

1 min read

– శివకృష్ణ యాదవ్ బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవస్థానం లో సాధువుల ను పరామర్శించిన బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షులు శివకృష్ణ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాగంటి దేవస్థానంలో నిత్యం వందల మంది భక్తులకుఅన్నదానం జరుగుతున్న దేవస్థానాన్ని నమ్ముకుని ఆశ్రయం పొందినటువంటి సాధువులకు మాత్రం వారానికి రెండు రోజులు ఒక్కపూట మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. వారంలో రెండు రోజులు మాత్రమే అన్నదాన సత్రాలు సాధువులకు అన్నం తినేందుకు అవకాశం కల్పించడం చాలా బాధాకరమైన విషయం అణువణువునా ప్రతి జీవిలో పరమేశ్వరుడు ఉంటాడు అని ప్రతి ఒక్కరం భావిస్తూ ఉంటాము అలాంటి సందర్భంలో కుటుంబాలకు దూరమై వారి జీవితంలో ఎన్నో ఒడు దుడుకులు ఎదుర్కొని ఓడిపోయి సాధువులుగా మారడం అనేక సమస్యలు ఎదుర్కోలేక పరమేశ్వరుని సన్నిధిలోనే తమ జీవితం గడపాలని భావించి కొంతమంది సాధువుగా మారడం జరుగుతున్నది. అలాంటి వారి పట్ల దయతో కూడిన భావన కలిగి ఉండాలి కానీ అన్న సత్రాల్లో కొంతమంది తమ ఆలోచన విధానాలను సాధువులపై చూపడం వారిని అసహ్యించుకోవడం వంటి ఘటనలు బాధాకరం గొప్ప పుణ్యక్షేత్రం శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవస్థానం సాధువులకు ఆశ్రయం పొందడానికి ఒక్క ప్రభుత్వ సత్రం కూడా లేకపోవడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం దేవాలయ శాఖ వారు హిందూ సాంప్రదాయ బద్ధంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి సాధువులకు ఇవ్వవలసిన గౌరవం కూడా ఇవ్వకుండా వారిని యాచకులుగానే చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాము శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవస్థానం నందు సాధువులకు తప్పకుండా ఒక షెడ్డు నిర్మిం చాలి అక్కడ ఏదైతే అన్న సత్రాలు నిర్వహిస్తున్నారో సాధువులకు కూడా రెండు పూటలా అన్నం పెట్టాలని ఎండోమెంట్ అధికారులు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం సాధువులను నిర్లక్ష్యం చేసిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ మరియు హిందూ బంధువులతో కలిసి సాధువుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు.

About Author