PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోరంట్ల మాధ‌వ్ పై చ‌ర్య‌లు తీసుకునే అంశం పై స్పందించిన స‌జ్జ‌ల !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకునే అంశం పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మాధవ్‌ వ్యవహారాన్ని ఓటుకి నోటు కేసుతో ఆయన పోల్చారు. గతంలో తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు వాయిస్‌తో వచ్చిన.. ఆడియోకు సపోర్టింగ్‌గా డబ్బులు కూడా దొరికాయని తెలిపారు. ఆవాయిస్ చంద్రబాబుదో కాదో ఇప్పటికీ తేల్చలేదన్నారు. ప్రస్తుత ఇష్యూ కంటే చంద్రబాబు ఇష్యూ పెద్దదని చెప్పారు. గోరంట్ల వ్యవహారంలో మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిజానిజాలు తేలేవరకూ ఆగాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

                                   

About Author