PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీతాలు చెల్లించాలి – యుటిఎఫ్…

1 min read

పల్లెవెలుగు వెబ్ ,ప్యాపిలీ:  7 వ తేదీ దాటినా ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేదని,రెండు మూడు నెలల నుండి కొద్దిమంది ఉపాధ్యాయులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కావున ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని యుటిఎఫ్ ప్యాపిలి మండల అధ్యక్షులు కృష్ణా నాయక్ డిమాండ్ చేశారు.ఏనుగుమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపుగా 7,000 మంది ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడి లు కేటాయించక ఉపాధ్యాయులకు జీతాలు బిల్లు చేయడం సాధ్యం కాలేదని అందువల్ల జీతాలు లేక మూడు నెలల నుండి ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఐడి లు రాని ఉపాధ్యాయులు ఇంకా ఉన్నారని వారికి కూడా జీతాలు అయ్యేలా చూడాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా కౌన్సిలర్ బొజ్జన్న,సాలయ్య,లోకేశ్వరి,నాగాంజనేయులు,పాల్,నాగ మద్దయ్య,మారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author