PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీతం రూ. 1.98 కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో ఐఐటీ మద్రాస్‌ రికార్డు సృష్టించింది. రెండు దశల్లో నిర్వహించిన ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో 380 కంపెనీలు పాల్గొని 1,199 ఉద్యోగాలను విద్యార్థులకు ఆఫర్‌ చేశాయి. దీనికితోడు మరో 231 మందికి ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు అందడంతో ఈసారి మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,430కి చేరింది. 2018-19 విద్యా సంవత్సరంలో నమోదైన 1,151 జాబ్‌ ఆఫర్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ డ్రైవ్‌లో విద్యార్థులు అందుకున్న సగటు వేతనం రూ.21.48 లక్షలు కాగా, ఒక విద్యార్థికి అత్యధికంగా రూ.1.98 కోట్ల (2,50,000 డాలర్లు) ప్యాకేజీ లభించిందని ఐఐటీ మద్రాస్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

                                         

About Author