PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 సంసారం సాఫీగా… కొనసాగించండి : ఎంపీ టీజీ వెంకటేష్​

1 min read

పల్లెవెలుగు వెబ్, కర్నూలు: దురలవాట్లకు దూరంగా ఉంటే… సంసారం సాఫీగా సాగుతోందన్నారు రాజ్య సభ సభ్యలు టీజీ వెంకటేష్​.  ఆదివారం నగరంలోని మౌర్య ఇన్​లోని ఎంపీ కార్యాలయంలో మే 16న వివాహం చేసుకున్న 60 జంటలకు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఒక్కొక్క జంటకు 60 వేల రూపాయల (వధువుకు 30,000, వరునికి 30,000) చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ దురలవాట్లు ఉన్న వ్యక్తులు డబ్బులు పెట్టి  అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే వారు అని అన్నారు.  ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అన్నది ఒక మంచి మలుపు అని అన్నారు.  పెళ్లితో వధూవరులకు ఇద్దరికీ బాధ్యతలు పెరుగుతాయని అందుకు ఇరువురు సిద్ధమై, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పుట్టబోయే పిల్లలు జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగాలని టీజీ కోరారు. నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతుల అందరూ ఎటువంటి విభేదాలు లేకుండా సంసారాన్ని సాఫీగా కొనసాగించాలని కోరుతూ నవ దంపతులు అందరిని ఆయన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో tgv ట్రేడ్ యూనియన్ నాయకులు బాలయ్య, పాల్ రాజు టిజివి ట్రస్ట్ కోఆర్డినేటర్ దాశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author