NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భీమ్లా నాయక్ పై ఆంక్షలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈనెల 25న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమా పై ఆంక్షలు విధించింది. థియేటర్లకు ముందస్తు నోటీసులు జారీ చేసింది. బెనిఫిట్ షో, అదనపు షోలు వేయరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్చలు తప్పవని, టికెట్ రేట్లు ప్రభుత్వం నిబంధనల మేరకు ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సినిమాటోగ్రఫీ చట్టం 1952 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో వెల్లడించారు.

          

About Author