PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏనుగుకు బ‌హుమ‌తిగా చెప్పులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చెన్నైలోని నెల్లయప్పర్‌ ఆలయ ఏనుగుకు ఓ భక్తుడు పాదరక్షలు విరాళంగా అందజేశారు. తిరునల్వేలిలోని అరుళ్‌మిగు నెల్లయప్పర్‌ గాంధీమతి అమ్మన్‌ ఆలయానికి సొంతమైన ‘గాంధీమతి’ అనే ఏనుగు ఉంది. చక్కెర వ్యాధితో బాధపడుతున్న ఆ ఏనుగు నడిచే సమయంలో పాదాలకు నొప్పి లేకుండా, మోకాలి నుంచి పాదాల వరకు తోలుతో చేసిన రూ.12 వేల విలువైన పాదరక్షలను భక్తులు అందజేశారు. ఆలయ ఏనుగుకు భక్తులు పాదరక్షలు విరాళంగా ఇవ్వడం రాష్ట్రంలో ఇదే తొలిసారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

                                      

About Author