PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిపిఎస్ రద్దు కోరుతూ సంకల్ప దీక్ష..

1 min read

– రద్దయ్యే వరకు అలుపెరగని పోరాటం చేస్తాం..
– రాష్ట్ర జేఏసీ నాయకుడు ఆర్ఎస్ హరినాథ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు యు. టి. ఎఫ్. కార్యాలయ ఆవరణలో ఆదివారం సి. పి. ఎస్. రద్దు కోరుతూ నిర్వహించిన సంకల్ప దీక్షలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించడo. ఈ సందర్బంగా రాష్ట్ర జె. ఏ. సీ. నాయకుడు ఆర్. ఎస్. హరనాథ్ మాట్లాడుతూ సి. పి. ఎస్. రద్దు అయ్యేవరకు అలుపెరగని పోరాటం చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సి. పి. ఎస్. రద్దుచేస్తామని ఇప్పటికే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ప్రకటించారని తెలుగుదేశం పార్టీ కూడా తన నిర్ణయాన్ని ఆపార్టీ నాయకుడు లోకేష్ ద్వారా తన పాదయాత్ర తిరుపతి చేరుకున్నప్పుడు తిరుమల వెంకన్న సాక్షిగా సి. పి. ఎస్. ను రద్దు చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేసారు.. ఈ కార్యక్రమంలొ యు. టి. ఎఫ్. ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవి కుమార్, పి. వి. జిల్లా జె. ఏ. సీ. కన్వీనర్ నెరుసు రామారావు నాయకులు పూడి శ్రీనివాస రావు, కనకదుర్గ, రంగబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author