PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఔదార్యం..

1 min read

వైసీపీ కార్యకర్త  ఆరోగ్య చికిత్సకు ఆర్ధిక సహాయం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  వైసీపీ కార్యకర్త అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆర్థిక సహాయం అందించి తన ఔదార్యం చాటుకున్నారు. నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య  అనుచరుడు బోయ శేఖర్ అనారోగ్యం తో  కర్నూలు లో  హాస్పిటల్ నందు చేరారు. వైసీపీ నాయకుల ద్వారా  విషయం తెలుసుకున్న సిద్దార్థ రెడ్డి చలించిపోయారు. తక్షణమే  అతని వైద్య ఖర్చుల కొరకు తన వంతుగా   రూ.70 వేలు ఆర్థిక సహాయం అందచేశారు.ఈ ఆర్థిక సహయం బుధవారం  నందికొట్కూరు ఎంపీపీ మురళి కృష్ణ రెడ్డి, ఓంకార్ రెడ్డి, అలంపూర్ రవీంద్ర నాయుడు స్వయంగా వైద్యశాలకు వెళ్లి శేఖర్ ను పరామర్శించి అందజేశారు. ఆర్ధిక సహాయం అందించిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి శేఖర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author