PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సర్పంచ్  బిక్షాటన ..

1 min read

రూ.12 లక్షల బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో నిరసన..

పల్లెవెలుగు. నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని వడ్డమాను గ్రామం టిడిపి సర్పంచ్ బోయ  రామచంద్రుడు గురువారం గ్రామంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం పై నిరసన తెలియజేశారు.  గ్రామ అభివృద్ధి  కోసం గ్రామంలో జి ఎల్ ఎస్ ఆర్ ట్యాంక్  పైప్ లైన్స్ రూ.6 లక్షల తో వేశారు.     గ్రామంలోని బోర్లు  మోటర్లు  కొత్త పైపులైన్ల కొరకు అలాగే  బోర్ల రిపేరు కొరకు. సుమారు రూ. 04 లక్షలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేశారు . సర్పంచ్ గెలిచినప్పటి నుండి ఇప్పటివరకు సర్పంచ్ నిధులలో ఒక్క రూపాయి కూడా లేవు. గ్రామాభివృద్ధి కోసం డబ్బులు అప్పు తెచ్చుకొని వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నానని  గ్రామంలో భిక్షాటన చేసి ప్రభుత్వం పై  నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

About Author