PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతుని భార్యకు నగదు అందజేసిన సర్పంచ్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో గ్రామానికి చెందిన వనంపల్లె స్వాములు(26)ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ మరణించారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కె.మదార్ సాహెబ్ వైయస్సార్ బీమా తక్షణ సహాయం కింద 10 వేల నగదును మృతుని భార్య గాయత్రికి సర్పంచ్ అందజేశారు.అతి చిన్న వయసులో స్వాములు మృతి చెందడం,కుటుంబ యజమాని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు.మృతునికి గీత (5), జై(4) ఇద్దరు సంతానం ఉన్నారు.ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎం.రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author