PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భీమా నగదును అందజేసిన సర్పంచ్…

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వైయస్సార్ బీమా పేదలకు వరమని కడుమూరు గ్రామ సర్పంచ్ ఎస్.జీవరత్నం అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందిన వెలుగోటి బాలకృష్ణ(41)ఆరోగ్యం బాగా లేనందున కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గత వారం రోజుల నుండి చికిత్స తీసుకుంటూ 8వ తేదీ రాత్రి 7 గంటలకు మరణించారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మరియు పంచాయితీ కార్యదర్శి బి.శివకళ్యాణ్ సింగ్ మృతుని ఇంటికి వెళ్లి వైయస్సార్ బీమా తక్షణ సహాయం కింద 10 వేల రూపాయల నగదును మృతుని భార్య వి.లక్ష్మీదేవికి అందజేసినట్లు పంచాయతీ కార్యదర్శి శివకళ్యాణ్ తెలిపారు.మిగిలిన 90 వేల రూపాయల బీమా పరిహారం కూడా క్లెయిమ్ చేసినట్లు ఆయన తెలిపారు.మృతుని భార్య గ్రామంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈయనకు మేఘన(19),విజయ్ కుమార్(17)సంతానం ఉన్నారు.కుటుంబ యజమాని మృతి చెందిన పట్ల కుటుంబం మరియు బంధుమిత్రుల్లో విషాద ఛాయలు అలు ముకున్నాయి.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ రహిమాన్,ఏఎన్ఎం కళ్యాణి పాల్గొన్నారు.

About Author