PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల ఆకలి తీర్చడం అదృష్టం: ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

1 min read

పల్లెవెలుగువెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి:   అన్నమయ్య  జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రం గ్రీవెన్ సెల్ అర్జీదారులకు, ప్రజలకు ఆకలి తీరుస్తుండడం ఆనందదాయకంగా ఉందని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.   వైఎస్ఆర్ సిపి నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ సౌజన్యంతో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కేంద్రాన్ని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సందర్శించి అర్జీదారులుకు,ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి స్వయంగా వడ్డించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ  జిల్లా నలుమూల నుంచి గ్రీవెన్ సెల్ రోజున సోమవారం నాడు పేదలు కలెక్టరేట్, ఎస్ పి కార్యాలయాలకు వస్తుంటారని, బోజనాలకు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన అన్నదానం నేటితో పదవవారం అయిందన్నారు.ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.అన్నదాన కార్యక్రమానికి కొంతమంది దాతలు ముందుకు వస్తుండడం అభినందనీయమన్నారు.

అన్నదాతలూ సుఖీభవ…

 వారం వారం ఎంఎల్ఏ  శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో, దాతల సౌజన్యంతో గ్రీవెన్ సెల్ రోజున జిల్లావ్యాప్తంగా వచ్చే ప్రజలకు  రుచికరమైన ,నాణ్యమైన భోజనాన్ని అందిస్తుండడంపై హర్షం వ్యక్తం చేస్తూ అన్నదాతలూ సుఖీభవ అంటూ  జిల్లా వ్యాప్తంగా ప్రజలు అభిననందిస్తూ, దీవెనలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్,  మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, మండల బిసి నాయకులు పల్లపు రమేష్, గాలివీడు వైస్ ఎంపిపి యదుభూషన్ రెడ్డి,  సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, అన్నా సలీం, మాజీ వైస్ ఎంపిపి రమేష్ రెడ్డి,మహేష్ రెడ్డి,గంగిరెడ్డి,   జావీద్, అమీర్,కొత్తపల్లె ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author