PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ కర్నూలు పార్లమెంట్​ బీసీ సెల్​ అధ్యక్షులుగా సత్రం రామకృష్ణ

1 min read

బీసీలకు ప్రాధాన్యత కల్పించిన అధినేత

కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర కార్యదర్శి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్​ ప్రెసిడెంట్​ వై. నాగేశ్వర రావు యాదవ్​

పల్లెవెలుగు వెబ్​: బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ… కర్నూలు పార్లమెంట్​ బీసీ సెల్​ అధ్యక్షులుగా సత్రం రామకృష్ణను అధికారికంగా ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర కార్యదర్శి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్​ ప్రెసిడెంట్​ వై. నాగేశ్వర రావు యాదవ్.శనివారం కర్నూలు వైఎన్​ఆర్​ కార్యాలయంలో సత్రం రామకృష్ణను, TNSF రాష్ట్ర అధికార ప్రతునిది రెడ్డిపోగు బజారన్న మరియు TNSF కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బొగ్గుల ప్రవీణ్ ను  వై. నాగేశ్వర రావు పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వై. నాగేశ్వర రావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కులుమాల రాముడు,పర్ల మహానంది,మన్యంకుంట రాముడు, రాముడు నాగరాజు, ప్రసాద్,నాగరాజు, దినేష్,జలీల్ భాష,నరసింహులు తెలుగుదేశం పార్టీ  నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author