NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీపీఎస్సీ చైర్మ‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన స‌వాంగ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్‌రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది గౌతమ్‌ సవాంగ్‌కు అభినందనలు తెలిపారు. గౌత‌మ్ స‌వాంగ్ ఇటీవ‌ల ఏపీ డీజిపిగా ప‌నిచేశారు.

                                      

About Author