PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కురువలకు.. ఎస్సీ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి..

1 min read

పల్లెవెలుగు వెబ్​:ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ 53 ప్రకారం కురవలకు మాదాసి మదారి కురువ కుల ధ్రువీకరణ పత్రాలను  మంజూరు చేయాలని మదాసి మదారి కురువ సంఘం నాయకులు ఇన్చార్జి తాసిల్దార్ విష్ణు ప్రసాద్ కు బుధవారం మెమోరాండం అందజేశారు. కుల ధ్రువీకరణ పత్రం జారీలో అధికారులు ఏమాత్రం జాప్యం లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు ఎంతోకాలంగా ఎస్సీ కుల ధ్రువీకరణ కోసం కురువ కులస్తులందరూ ఎదురు చూశారన్నారు. ఈ మేరకు ప్రభుత్వం మదాసి మదారి కురువ ఎస్సీ కుల ధ్రువీకరణ కోసం 53 జీవోను విడుదల చేసిందన్నారు. ఇప్పటికైనా అధికారులు ఎలాంటి కొర్రీలు లేకుండా మాదాసి మదారి కురవలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాదాసి మదారి కురువ సంఘం నాయకులు మారేళ్ల లక్ష్మన్న బ్రహ్మయ్య బొంబాయి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author