PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘షెడ్యుల్డ్​ కులాలు’ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

1 min read

– ఎమ్మార్పీఎస్​ మండల కన్వీనర్ రామాంజనేయులు
పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: షెడ్యుల్డ్​ కులాలు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు ఎంఆర్​పీఎస్​ మండల కన్వీనర్ రామాంజనేయులు మండల కార్యదర్శి బాలరాజు జిల్లా సీనియర్ నాయకులు సంజప్ప. బుధవారం ఎంఆర్పీఎస్​ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మండల గౌరవ అధ్యక్షులు పెద్దయ్య,మండల అధికార ప్రతినిధి సుదర్శన్, MSP జిల్లా నాయకులు మనోజ్ మాట్లాడుతూ మాదిగల ఆత్మ గౌరవ నినాదంతో మందా కృష్ణ మాదిగ ఎంఆర్​పీఎస్​ను స్థాపించారని గుర్తు చేశారు. విద్యా, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ… గ్రామగ్రామాన మాదిగలను చైతన్యం చేస్తూ జాతీయ స్థాయిలో MRPS ఉద్యమాన్ని నడిపించారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్​. అంబేద్కర్​ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం మందాకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో MRPS మండల నాయకులు నెట్టెకల్లు, హనుమంతు, శ్రీనివాసులు, మాజీ మండల కన్వీనర్లు నరసన్న, సంజన్న, మరియు మహానంది, రాజు, తిక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author