PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

55 ఏళ్లకు బడి పంతులు..

1 min read

స్వీటు తినిపిస్తున్న జర్నలిస్టులు

1998 డీఎస్సీలో దావుద్‌ కు ఉద్యోగం

పల్లెవెలుగువెబ్​, చాగలమర్రి :నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణానికి  చెందిన మాజీ సైనిక ఉద్యోగి సయ్యద్ సాహెబ్‌, మైమున్నిసా దంపతుల రెండవ సంతానమైన దావుద్‌ కు  1998 డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చింది . ప్రభుత్వ ఉద్యోగంపై ఆశ వదిలేసి విద్యా వాలంటీర్‌గా పనిచేస్తూ జర్నలిస్టుగా   గా పని చేస్తున్న దావుద్‌ కు ఇప్పుడు 55 ఏళ్లు . ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు ఆయన కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు .1998 డీఎస్సీలో అర్హులైన వారికి ఉద్యోగ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కి దావుద్‌ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా దావుద్‌కు తోటి జర్నలిస్టులు,స్నేహితులు స్వీట్లు తినిపించి అభినందించారు .కార్యక్రమం లో జర్నలిస్టులు రవిపాల్‌,శివకుమార్‌,బాలుడు,జాపర్‌,బాస్కర్‌రెడ్డి,ఈఎమ్‌బి,గోవింద్‌,కేశవ,గౌస్‌,స్నేహితులు ఐడియాబాబు,మాబుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.

About Author