NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి .. హెచ్ ఓ డి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని కలెక్టర్ ఆదేశాల మంగళవారం నాడు హెచ్ ఓ డి నంద్యాల ఆర్టీసీ డిపో రీజినల్ మేనేజర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ఐదు నుండి 18 సంవత్సరాలు నిండిన పిల్లలు చదువుకోవాలని డ్రాప్ అవుట్ ఉంటే వాటిపై దృష్టి పెట్టాలని గతంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చేపట్టి సమాచారం సేకరించినట్టు వాటి ఆధారంగా  మండలానికి ఒక హెచ్ ఓ డీ  గా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి డ్రాప్ ఔట్ పై సర్వే చేపట్టినట్టు శ్రీనివాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వెల్ఫేర్ ఆఫీసర్ వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author