PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈనెల 26, 27 తేదీలలో స్కూల్ గేమ్స్ సెలక్షన్స్

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ పరిధిలో స్కూల్ గేమ్స్ సెలక్షన్లు ఈ నెల 26,27 తేదీలలో నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చందు నాయక్ ప్రకటించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు మరియు పత్తికొండ నియోజకవర్గంలోని  ఐదు మండలాల మండల కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పత్తికొండ మండల విద్యాధికారులు శ్రీ మస్తాన్వలి, జి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాలతి  ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గస్థాయి సెలక్షన్స్ నిర్వహణపై చర్చించారు. నిర్ణయం తీసుకున్నారు ఈ సెలక్షన్స్ ఈనెల 26వ తేదీన బాలురకు 27వ తేదీన బాలికలకు టోర్నమెంట్ కం సెలక్షన్స్ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. పత్తికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగే సెలక్షన్స్ లో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పార్టిసిపేట్ కావాలని స్కూల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోఆర్డినేటర్ చందు నాయక్ కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు పాండు, సంజప్ప, మధు, అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు వేణు, రాజేష్ రంగస్వామి, హనుమన్న, ఆంజనేయులు, సునీల్, శేఖర్, రజియా, రుక్మిణి, దేవి తదితరులు పాల్గొన్నారు.

About Author